Visakhapatnam: మారికవలస గురుకుల పాఠశాల సమస్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆగ్రహం
Visakhapatnam: మారికవలస గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు లేక 1000 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు.
Visakhapatnam: మారికవలస గురుకుల పాఠశాల సమస్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆగ్రహం
Visakhapatnam: రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస్ కామెంట్స్ మారికవలస గురుకుల పాఠశాలలో దాదాపు 1000 మంది పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ చదువుతున్న పిల్లలను ఎక్కడికో పంపించేశారు, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల పరిస్థింది చాలా దారుణంగా ఉంది.
ఇక్కడ ఉన్న పిల్లలను ఎక్కడికో పంపించేసి... ఎక్కడో ఉన్న పిల్లలు ఇక్కడ పంపించడం ఏంటి, డిల్లీ, నోయిడా నుంచి ఉపాధ్యాయులు ఇక్కడి వచ్చి పాటలు చెప్పడం ఏంటి... ఇక్కడ ఉన్న వాళ్లు సరిపోరా, గత ప్రభుత్వంలో కూడా బెయిజుస్ వాళ్ళతో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుంది వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు.
మారికవలస పాఠశాలలో కనీస సదుపాయాలు లేవు, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పిల్లలను ఇక్కడికి తీసుకువచ్చి ఇప్పుడు తలుపులు పైపులు వేస్తున్నారు. ఐటీ sez లొ అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి వాటిని ఎందుకు వాడటం లేదు.
ఇవన్నీ చూస్తుంటే ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లా లేదు ఇది సెంటర్ ఆఫ్ డిస్ట్రక్షన్ఆం, దోళన తర్వాత పిల్లలను ఇక్కడికి తీసుకువచ్చారు సరే వాళ్ళకి సరైన తిండి లేదు, ఎడ్యుకేషన్ లో టాప్ అని చెప్పుంటారు కదా అప్పుడు మన రాష్ట్రం లో సరైన ఉపాధ్యాయులు లేరా, గిరిజన విద్యార్థుల పట్ల సరైన శ్రద్ధ ఉంటే రుషికొండ భవనం లో పెట్టండి.
గిరిజనులు అంటే అంత చులకన తర్లువాడ లో గూగుల్ డేటా సెంటర్లు కు భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదు. స్థానిక శాసనసభ్యుడు అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. రుషికొండ భవనంలో గిరిజనలుకు ఎందుకు పెట్టకూడదు.




