Narsipatnam: నర్సీపట్నం అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధుడి ఆమరణ దీక్ష!

Narsipatnam: నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద వృద్ధుడు సాగి విశ్వనాథరాజు ఆమరణ నిరాహార దీక్ష. డ్రైనేజీ మురుగునీటి సమస్యపై స్పందించని అధికారుల వైఖరికి నిరసన.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 31 Aug 2026 2:04 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నం అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధుడి ఆమరణ దీక్ష!

Narsipatnam: నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద సాగి విశ్వనాథరాజు అనే వృద్ధుడు సోమవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. బ్యాంక్ కాలనీలో నివసించే ఆయన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మురుగునీరు చేరడంతో గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ఆవేదనతో నిరాహారదీక్షకు కూర్చున్నానని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు దీక్ష చేస్తానన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story