Visakhapatnam: ఉచిత విద్యుత్ నిర్ణయంపై హర్షం.. విశాఖ మేయర్ రేసులో బీజేపీ: పరశురామరాజు

Visakhapatnam: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపిన విశాఖ బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు, మేయర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 6:41 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఉచిత విద్యుత్ నిర్ణయంపై హర్షం.. విశాఖ మేయర్ రేసులో బీజేపీ: పరశురామరాజు

Visakhapatnam: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు జనతా వారిది కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల్లో గత సోమవారం సమర్పించిన వినతి పత్రాలలో.

వినాయక చవితి మండపలకు జీవీఎంసీ, పోలీసులు సింగిల్ విండో అనుమతితో పాటు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని చేసిన విన్నపంపై సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

గ్రామాల్లో 3, పట్టణములో 5 కిలో వాట్లు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడం జరిగింది.

నరేంద్ర మోడీ గారు 25 ఏళ్ళ పాలన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులు సేవా సంకల్ప అభియాన్ పేరిట 13 రకాల కార్యక్రమంలతో పాటు రక్త దానం శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు.

గత బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో

రవాణా వ్యవస్థ -- శాఖ మెట్రో -- ఫ్లై ఓవర్స్

2050 వాటర్ సెక్యూరిటీ మాస్టర్ ప్లాన్ -- పోలవరం నీటి వినియోగం

పరిశ్రమలు - ఉపాధి - నైపుణ్యాఅభివృద్ధి

పోర్టు కాలుష్య నియంత్రణ -- పర్యావరణ పరిరక్షణ

సింహాచల పంచ గ్రామాలు - 22 A సమస్యల పరిష్కారం - భూ హక్కులు

విద్య, ఆరోగ్య, క్రీడా వసతులు మరియు శాఖ 2040 మిషన్ వంటి అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించడం జరిగిందని తెలియజేశారు. గత నెలలో విశాఖలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన తరువాత నుండి బిజెపిలోకి చేరికల భారీగా పెరిగాయని అన్నారు.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉందని అన్నారు. జాయిన్ బీజేపీ - సేవ్ ఇండియా పోస్టర్ ఆవిష్కరణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులు 100% స్ట్రైక్ రేట్ తో కూటమి విజయం సాధిస్తారని అన్నారు.

విశాఖ మేయర్ రెసులో బీజేపీ ఉంటుంది. అవకాశం ఇస్తే మేయర్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మీడియా ప్యానలిస్ట్ KNPచక్రవర్తి, జిల్లా మీడియా కన్వీనర్ T కోటేశ్వరరావు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్