Anakapalli: అనకాపల్లి జనసేన ఆఫీసులో ప్రజా సమస్యల వినతులు!
Anakapalli: అనకాపల్లి జనసేన కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఇన్చార్జ్ భీమరశెట్టి రామ్కి. ఎమ్మెల్యే కొణతాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.
Anakapalli: అనకాపల్లి జనసేన ఆఫీసులో ప్రజా సమస్యల వినతులు!
అనకాపల్లి: అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి కార్యకర్తలు తమ వ్యక్తిగత, సామాజిక మరియు అభివృద్ధి సంబంధిత సమస్యలను వినతి పత్రాల రూపంలో సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి ప్రజలు, కార్యకర్తలు వివరించిన సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం ఆయా సమస్యలను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలకు వేగంగా స్పందించడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని రామ్కి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ప్రతి వినతిని బాధ్యతగా పరిగణించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక జనసేన నాయకులు, కూటమి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు.




