Anakapalli: పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

Anakapalli: అనకాపల్లి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జనసేన నాయకులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 21 April 2026 11:25 AM IST
Anakapalli:
X

Anakapalli

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అడ్డురోడ్డు జంక్షన్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేనాపతి బాబురావు, మాస్టారు అప్పికొండ లవ రాజు, గుర్రం ధన, బోండా కృష్ణ, ఎర్ర మాధవ్, ఎర్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story