Visakhapatnam: చెత్త నుంచి విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి లక్ష్యం: మంత్రి నారాయణ!

Visakhapatnam: ఏపీలో ఘన వ్యర్థాల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం: మంత్రి నారాయణ. విశాఖ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యం 1600 టన్నులకు పెంపు, త్వరలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 19 Sept 2026 11:42 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: చెత్త నుంచి విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి లక్ష్యం: మంత్రి నారాయణ!

విశాఖపట్నం: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత, ఇళ్లు, కార్యాలయాలు, హోటళ్లు, స్కూళ్ల నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణ, చెత్తను విద్యుత్‌గా మార్చేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు, రాష్ట్రవ్యాప్తంగా కొత్త వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు, విశాఖ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యం 1,200 నుంచి 1,600 టన్నులకు పెంపు, నవంబర్ నాటికి విశాఖ ప్లాంట్ అందుబాటులోకి తీసుకురానున్నాం.

రాబోయే రెండేళ్లలో మరిన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు, గతంలో పేరుకుపోయిన లెగసీ వేస్ట్‌లో భారీగా క్లియరెన్స్, మిగిలిన లెగసీ వేస్ట్‌ను కూడా త్వరలో తొలగిస్తాం, C&D వ్యర్థాలను రీసైకిల్ చేసి తిరిగి వినియోగించేలా చర్యలు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో C&D వేస్ట్ ప్లాంట్లపై ప్రత్యేక దృష్టి, కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు.

విశాఖలో రోజుకు 30 టన్నుల సామర్థ్యంతో బయోగ్యాస్ ప్లాంట్, చెత్తను విద్యుత్, గ్యాస్, రీసైక్లింగ్ ద్వారా సంపదగా మార్చడమే లక్ష్యం, వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఏపీని దేశంలో ముందంజలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యం.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.