Chodavaram: చోడవరంలో భారీ చోరీ తాళం వేసిన ఇంట్లో 20 తులాల బంగారం అపహరణ!

Chodavaram: సీమునాపల్లిలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ. 20 తులాల బంగారం, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 2 Sept 2026 7:54 AM IST
Chodavaram
X

Chodavaram: చోడవరంలో భారీ చోరీ తాళం వేసిన ఇంట్లో 20 తులాల బంగారం అపహరణ!

Chodavaram: మండలంలోని సీమునాపల్లిలో భారీ చోరీ జరిగింది. ఎల్లపు వెంకటరమణ శుభకార్యం నిమిత్తం కుటుంబ సభ్యులతో ఇటీవల విజయ వాడ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఆగంతకులు రాత్రి ఇంట్లోని బంగారం, నగదు దోచుకుపోయారు.

పక్కింటి వారు అందించిన సమాచారం మేరకు ఇంటి యజ మాని హుటాహుటిన సీమునాపల్లి చేరుకు న్నారు. 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు దొంగలు పట్టుకుపోయారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కార్తిక్ పేర్కొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story