Visakhapatnam: వాసి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Visakhapatnam: విశాఖ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వేళ రెండు రోజుల ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. వాసి గ్రామంలో పాల్గొన్న డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప క్రిష్ణ.
Visakhapatnam: వాసి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న జరగనున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రెండు రోజుల ముందుగానే పంపిణీ చేస్తోంది.
ఈ సందర్భంగా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీ గొంప క్రిష్ణ గారు వాసి గ్రామంలోపర్యటించి, అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంనారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Next Story




