Visakhapatnam: విశాఖలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ – హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

Visakhapatnam: సెయింట్ అలోసియస్ హైస్కూల్ గ్రౌండ్‌లో సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.

SHIVA, BHIMILI
Published on: 26 Aug 2026 5:27 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ – హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

విశాఖపట్నం: కోట వీధి, సెయింట్ అలోసియస్ హైస్కూల్ గ్రౌండ్‌లో సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు జనసేన ఉత్తరాంధ్ర కో-కన్వీనర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ సభ్యులు, 39వ వార్డు మాజీ కార్పొరేటర్ శ్రీ మహమ్మద్ సాదిక్ భాయ్ గారు పాల్గొన్నారు.

మిలాద్-ఉన్-నబీ ప్రాముఖ్యత

ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని స్మరించుకుంటూ మిలాద్-ఉన్-నబీ వేడుకలను నిర్వహిస్తారు. ఆయన బోధించిన శాంతి, ప్రేమ, దయ, క్షమ, సోదరభావం మరియు మానవ సేవ వంటి విలువలను ప్రజలకు గుర్తుచేసుకునే సందర్భమిది.

ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సందేశం

“మతాలు వేరైనా మనమంతా ఒకే సమాజంలో సోదరులుగా జీవించాలి. ప్రవక్త మహమ్మద్ గారి శాంతి, ప్రేమ, మానవత్వం మరియు సోదరభావం సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి. విశాఖపట్నం ఎప్పటిలాగే మత సామరస్యానికి, ఐక్యతకు ఆదర్శంగా నిలవాలి.”

మిలాద్-ఉన్-నబీ వేడుకలు మనకు ఇచ్చే సందేశం — మత సామరస్యం, మానవత్వం, శాంతి మరియు సోదరభావం. కార్యక్రమంలో ముస్లిం కుటుంబీకులు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు...

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story