Salur: స్కూల్ గోడ కూలిన ఘటన: బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు!
Salur: సాలూరు ప్రభుత్వ స్కూల్ గోడ కూలి మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ.5 లక్షల పరిహారం చెక్కును అందజేసి ధైర్యం చెప్పారు.
Salur: స్కూల్ గోడ కూలిన ఘటన: బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు!
సాలూరు: సాలూరు పాఠశాల గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం. సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ.5 లక్షల పరిహారం చెక్కును అందజేశారు.
విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి వారికి ధైర్యం చెప్పారు ఈ విషాద సమయంలో విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు.
Next Story




