Palakonda: కోటదుర్గమ్మ అమ్మవారికి కానుకల వర్షం.. 50 రోజుల్లో రూ. 6.73 లక్షల ఆదాయం!

Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయ హుండీలను దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో బుధవారం లెక్కించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 14 May 2026 6:35 AM IST
Palakonda
X

Palakonda: కోటదుర్గమ్మ అమ్మవారికి కానుకల వర్షం.. 50 రోజుల్లో రూ. 6.73 లక్షల ఆదాయం! 

పాలకొండ: పాలకొండ వాసుల ఇలవేల్పు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కోటదుర్గమ్మ తల్లి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో భద్రత నడుమ ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది.

ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ) సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం ఎనిమిది హుండీలను అధికారుల సమక్షంలో తెరిచి లెక్కించారు. గత 50 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 6,73,482 (ఆరు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆయన ప్రకటించారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీ అధికారి రామారావు, ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, సహ అర్చకులు వేమకోటి శర్మ బాబు, వేమకోటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వీరితో పాటు బ్యాంకు అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. భక్తులు సమర్పించిన కానుకలను నిశితంగా లెక్కించి ఆలయ ఖాతాలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story