Palakonda: రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక విప్లవం.. పాలకొండలో మెప్మా అదిరిపోయే ప్లాన్!
Palakonda: విజయనగరం/పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో మెప్మా ఆధ్వర్యంలో ఈడీపీ (EDP) అవగాహన సదస్సు జరిగింది.
Palakonda: రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక విప్లవం.. పాలకొండలో మెప్మా అదిరిపోయే ప్లాన్!
Palakonda: పాలకొండ నగర పంచాయతీలో మెప్మా జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పాలకొండలో నిరుద్యోగులకు ఎస్సై జి మెంబర్లకు ఆర్పీలకు ఎంటర్ పెన్యునర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మహిళా పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్న తరుణంలో ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్త తయారు చేయాలని శ్రీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం.
కావున మహిళా శక్తిని మహోన్నత శక్తిగా మార్చే ఈ ప్రక్రియకు మెప్మా నాంది పలికింది కావున ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగాను 50,000 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత మెప్మా సంస్థ సిబ్బందిని ఈ క్రమంలో ఒక్క అడుగు వినూత్నంగా వేస్తున్నాం అందులో భాగంగా వ్యాపారాలపై చిన్న పరిశ్రమలు స్థాపనకై పరిశ్రమలు నిర్వహణకై అవగాహన పెంచుటకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సదుపాయం స్కీములను పొందు విధానంపై మరియు లైన్ డిపార్ట్మెంట్లు వ్యవసాయ శాఖ హార్టికల్చర్ పరిశ్రమల శాఖ పశుసంవర్ధక శాఖ స్కిల్ డెవలప్మెంట్ వారు ముఖ్యమైన అధికారులతో Entreprenewrship development programme (EDP) నిరుద్యోగులకు ఆర్పి లకు ఆ శాఖల వారు అందిస్తున్న సేవలు పథకాలు రాయితీలు లబ్ధిదారులు అప్రోచ్ అయ్యే విధానంపై అవగాహన గావించారు మెప్మా పీడీ శ్రీ బి.వి.నాగభూషణ రావు గారు, కమిషనర్ శ్రీ రతన్ రాజుగారు, సి ఓ లు, సీఎం ఎం శ్రీమతి దానాలమ్మగారు హాజరయ్యారు.




