Parvathipuram Manyam: మొరాయిస్తున్న ETIM మెషిన్లు - కండక్టర్ల అవస్థలు

Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ల తిప్పలు. ETIM మెషిన్లు మొరాయిస్తుండటంతో జేబులో పవర్ బ్యాంకులు పెట్టుకుని విధులు.

V.SESHU	, KURUPAM
Published on: 15 May 2026 6:41 AM IST
Parvathipuram Manyam
X

Parvathipuram Manyam: మొరాయిస్తున్న ETIM మెషిన్లు - కండక్టర్ల అవస్థలు

పార్వతీపురం మన్యం: జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు జారీ చేసే ETIM (ఎలక్ట్రానిక్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్)లు తరచూ మొరాయిస్తుండటంతో కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ సమస్యలు, చార్జింగ్ నిలవకపోవడం వంటి సాంకేతిక లోపాలతో రోజూ ఏదో ఒక బస్సులో కండక్టర్లు ఇబ్బంది పడక తప్పడం లేదు.

పరిమితికి మించి రద్దీ: ప్రస్తుతం స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి వంటి పథకాలతో బస్సులు పరిమితికి మించి ప్రయాణికులతో నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో టికెట్ మెషిన్లు హఠాత్తుగా హ్యాంగ్ కావడం, సిగ్నల్ రాకపోవడం, చార్జింగ్ అయిపోవడంతో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని కండక్టర్లు వాపోతున్నారు.

జేబులో పవర్ బ్యాంక్: మెషిన్ చార్జింగ్ ఎక్కువ సేపు నిలవకపోవడంతో కండక్టర్లు నిరంతరం తమ జేబులో పవర్ బ్యాంక్ పెట్టుకుని, మెషిన్‌కు ఛార్జింగ్ పెడుతూ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. సరైన సిగ్నల్ లేని రూట్లలో అయితే టికెట్ జనరేట్ కాకపోవడంతో ప్రయాణికులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త మెషిన్లు ఇవ్వండి: పాత మెషిన్ల స్థానంలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండే, సిగ్నల్ సమస్యలు లేని నూతన ETIM మెషిన్లను ప్రభుత్వం వెంటనే అందించాలని కండక్టర్లు కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రయాణికులకు సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతో పాటు, ఆర్టీసీ ఆదాయానికి కూడా గండి పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story