Parvathipuram: ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

Parvathipuram: పార్వతీపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 10 Sept 2026 3:55 PM IST
Parvathipuram
X

Parvathipuram: ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

పార్వతీపురం: ప్రజా దర్బార్‌లో ప్రజలు అందించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.గురువారం పార్వతీపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, పెన్షన్లు, బ్యాంకు రుణాలు, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించి ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు అందించే ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజా దర్బార్‌లో అందిన కొన్ని వినతులపై సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే తక్షణమే మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను పలువురు ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story