Cheepurupalli: లవిడంలో పేకాట రాయుళ్ల పైఉక్కుపాదం.. పోలీసుల మెరుపు దాడి
Cheepurupalli: విజయనగరం జిల్లా గుర్ల మండలం లవిడం గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూదం స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
Cheepurupalli: లవిడంలో పేకాట రాయుళ్ల పైఉక్కుపాదం.. పోలీసుల మెరుపు దాడి
చీపురుపల్లి: గుర్ల: గుర్ల మండలం లవిడం గ్రామ శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న జూదం స్థావరంపై గుర్ల పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు.
SI నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్లో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వారి నుండి ₹16,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI నారాయణరావు తెలిపారు.
మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Next Story




