Hanumakonda: నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం - మంత్రి పొంగులేటి హాజరు

Hanumakonda: హనుమకొండలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 16 Sept 2026 10:12 PM IST
Hanumakonda
X

Hanumakonda: నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం - మంత్రి పొంగులేటి హాజరు

హనుమకొండ: హనుమకొండ అదాలత్ సర్కిల్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతుండగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

గురువారం ఉదయం 9 గంటల 48 నిమిషాలకు అదాలత్ సర్కిల్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని అమరులకు రాష్ట్రమంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు నివాళులు ఘటించనున్నారు

అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జరిగే ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించి సందేశం ఇవ్వనున్నారు

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.