Hanumakonda: అక్రమంగా వెలిసిన గుడిసెలపై రెవెన్యూ అధికారుల ఉక్కు పాదం

Hanumakonda: హనుమకొండ గుండ్ల సింగారంలో ప్రభుత్వ స్థలాల తొలగింపు ఉద్రిక్తంగా మారింది.

AJAY, HANMAKONDA
Published on: 20 Jun 2026 8:55 AM IST
Hanumakonda
X

Hanumakonda: అక్రమంగా వెలిసిన గుడిసెలపై రెవెన్యూ అధికారుల ఉక్కు పాదం

Hanumakonda: హనుమకొండ గుండ్ల సింగారంలో ఉద్రిక్తత నెలకొంది. లిక్కర్ ప్లాంట్ సమీపంలో ఐదేళ్లుగా నివసిస్తున్న సుమారు 360 కుటుంబాల గుడిసెలను అధికారులు ఈరోజు తెల్లవారుజామున 5 గం. నుంచి తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు పొంది ఇక్కడే జీవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిలో సుమారు 30 మందిని పోలీసులు కేయూ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story