Hanamkonda: కుడా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: సుధారాణి, కలెక్టర్

Hanamkonda: కుడా పరిధిలోని ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, వేయి స్తంభాల గుడి పనులను వేగవంతం చేయాలని చైర్‌పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Sept 2026 8:40 PM IST
Hanamkonda
X

Hanamkonda: కుడా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: సుధారాణి, కలెక్టర్

హన్మకొండ: కుడా పరిధిలో చే పట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

మంగళవారం కుడా కార్యాలయం లో అభివృద్ధి పనుల పురోగతి మీద సంబంధిత అధికారులతో కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ....కుడా పరిధిలో చేపట్టిన వరంగల్ బస్ స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, వేయి స్తంభాల గుడి అభివృద్ధి పనులు, ఉనికి చర్ల, హన్మకొండ చౌరస్తా రీ డెవలప్మెంట్ , ఔటర్ రింగ్ రోడ్, NH గ్రీనరి మొదలగు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

భూ సేకరణ చేయాలిసి ఉన్న అభివృద్ధి పనులకు సంబందించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశం లో కుడా పి ఓ అజిత్ రెడ్డి, ఈ ఈ భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.