Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్లో రైతుల ఆందోళన!
Mahabubabad: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్లో రైతుల ఆందోళన!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ కొనుగోలు చేసిన మిర్చి , మొక్కజొన్న రైతులకు వెంటనే డబ్బులు ఇవ్వాలంటూ
రైతులు వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు కు తాళం వేసి... నిరసన వ్యక్తం చేశారు. మా డబ్బులు.. మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఎన్.ఎస్ ట్రేడర్స్ మహబూబాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ లో, మార్కెట్ బయట రైతుల నుంచి కొనుగోలు చేసిన మిర్చి, మొక్కజొన్నలకు వెంటనే డబ్బులు ఇప్పించాలని,
ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిందని, రేపు, మాపు ఇస్తామని రైతులను తిప్పుతున్నారని, వ్యవసాయ సీజన్ ప్రారంభం తో విత్తనాలు, మందు బస్తాలు కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే డబ్బులు మాకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.




