Mulugu: రేపటి నుంచి పాఠశాలల్లో ప్యానెల్ ఇన్స్పెక్షన్
Mulugu: ములుగు జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల్లో ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీమ్ల సందర్శనలు ప్రారంభం కానున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు.
Mulugu: రేపటి నుంచి పాఠశాలల్లో ప్యానెల్ ఇన్స్పెక్షన్
ములుగు జిల్లా: సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ములుగు జిల్లాలోని పాఠశాలల్లో పానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ సందర్శించను న్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రోజు పానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించి ప్యానల్ టీం సభ్యులు పాఠశాలలను సందర్శించినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించవలసిన అంశాలను,ఉపాధ్యాయు లకు సూచించవలసినటువంటి దిశా నిర్దేశం, నిర్మాణాత్మక సూచనలు, ఎఫ్ఎల్ఎన్ అమలు చేయడం తద్వారా విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసేలా పాటుపడాలని వారు అన్నారు.
జాతీయ విద్యా విధానం 2020 ని అనుసరించి FLN ద్వారా విద్యార్థిసాధించవలసినటువంటి సామర్ధ్యాలను సాధించేలా కృషి చేయాలన్నారు
Next Story




