Warangal: పోలీసుల అకస్మాత్తు దాడులు.. రూ. 2 లక్షల గుట్కా స్వాధీనం!

Warangal: నర్సంపేటలో మీడియా కథనాల ఆధారంగా పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ. 2 లక్షల విలువైన నిషేధిత అంబర్, గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 25 Aug 2026 10:34 AM IST
Warangal
X

Warangal: పోలీసుల అకస్మాత్తు దాడులు.. రూ. 2 లక్షల గుట్కా స్వాధీనం!

Warangal: నర్సంపేట పట్టణం లో జోరుగా నిషేదిత అంబర్ గుట్కా లు విక్రఇస్తున్నారాని శనివారం సాయంత్రం hmtv లో వార్త ప్రచురించడమైంది.సోమవారం రోజు పోలీసులు సాయంత్రం అంబేద్కర్ సెంటర్ లో ఉన్న రెండు షాపు లపై నర్సంపేట పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించి సుమారు రెండు లక్షల విలువ గల నిషేదిత అంబర్, గుట్కా లను పట్టుకోని స్వాదినం చేసుకున్నారు.

భూపతి రాజు అనే వ్యక్తి షాపు లో 1.80.000/- మరియు బొప్పారాతి సురేందర్ అనే వ్యక్తి షాపు లో 25,000 విలువ గల అంబర్, గుట్కా లను పట్టుకొని వారి పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.అలాగే నిషేదితమైన వాటిని అక్రమంగా అమ్మితే చర్యలు తప్పవని నర్సంపేట సీఐ మరియు ఎస్సై లు హెచ్చరించారు. పెద్ద మొత్తం లో నిషేదిత అంబర్, గుట్కా లని పట్టుకున్న పోలీసులని పలువురు ప్రశంస్తున్నారు.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story