Mahabubabad: మహబూబాబాద్లో ఘనంగా వరుణ యాగం
Mahabubabad: పాడి పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మహబూబాబాద్ హనుమాన్ ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు.
Mahabubabad: మహబూబాబాద్లో ఘనంగా వరుణ యాగం
మహబూబాబాద్: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని , రైతులు సుభిక్షంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని పురాతన హనుమాన్ దేవాలయం లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు ఆధ్వర్యం లో వరుణ యాగంను నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..... శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో వరుణ యాగమును నిర్వహిస్తున్నామన్నారు.
ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణం లోని పలువురు భక్తులు పాల్గొన్నారు.
Next Story




