Warangal: మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు

Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 10వ డివిజన్ మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 26 Aug 2026 9:02 PM IST
Warangal
X

Warangal: మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు

వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ మచిలీ బజార్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి గారు హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని విష్ణు రెడ్డి గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు,డివిజన్ అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story