Warangal: విధుల్లో నిబద్ధత ముఖ్యం.. ఆర్ఎస్ఐ భుజాలపై స్టార్స్ అలంకరించిన వరంగల్ సీపీ!

Warangal: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఏఆర్ఎస్ఐ నుంచి ఆర్ఎస్ఐగా పదోన్నతి పొందిన ఏ. కుమార స్వామికి స్టార్ల అలంకరణ. విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సీపీ పిలుపు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 8 Jun 2026 4:25 PM IST
Warangal
X

Warangal: విధుల్లో నిబద్ధత ముఖ్యం.. ఆర్ఎస్ఐ భుజాలపై స్టార్స్ అలంకరించిన వరంగల్ సీపీ!

వరంగల్: అప్పగించిన విధులను అధికారులు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఏఆర్ఎస్ఐ నుంచి ఆర్ఎస్ఐగా పదోన్నతి పొందిన ఏ. కుమార స్వామి సోమవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన భుజాలపై పదోన్నతి చిహ్నాన్ని సీపీ అలంకరించారు. విధుల్లో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ, ఉన్నతాధికారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story