Mahabubabad: గుక్కెడు నీళ్ల కోసం గార్లలో మహిళల రోడ్డెక్కి నిరసన!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మేజర్ పంచాయతీలో తీవ్ర తాగునీటి ఎద్దడి. ఖాళీ బిందెలతో మహిళల నిరసన ప్రదర్శన, గ్రామసభ ముట్టడి. సిపిఎం, న్యూడెమోక్రసీ మద్దతు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 2 Sept 2026 3:11 PM IST
Mahabubabad
X

Mahabubabad: గుక్కెడు నీళ్ల కోసం గార్లలో మహిళల రోడ్డెక్కి నిరసన!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మేజర్ గ్రామపంచాయతీ లో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కరించాలని రోడ్డు ఎక్కిన మహిళలు. ఖాళీ బిందెల తో గ్రామంలో ప్రదర్శన నిర్వహించి. నినాదలు చేసిన మహిళలు మంచినీటి సమస్య తో బాధ పడుతున్న మహిళలకు సిపిఎం, న్యూడెమోక్రసీ పార్టీలు మద్దతు ప్రకటించారు. అనంతరం స్థానికం గా జరుగుతున్న గ్రామసభ లో ఖాళీ బిందె లతో నిరసన అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంచినీటి సమస్య పరిష్కరించాలని మోరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన మహిళలు.

చుట్టూ నీళ్లు వున్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన, మిషన్ భగీరద నీళ్లను సైతం సక్రమంగా అందించాలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం. సమస్య పరిష్కరించుకుంటే మహిళలందరు ఏకమై తమ సత్తా చూపిస్తామని హెచ్చరిక.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story