Penumantra: పంచాయతీ వాహనాలపై విచారణ జరపాలని డిమాండ్!

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలో పంచాయతీ చెత్త రిక్షాలు పాత సామాన్ల దుకాణంలో ప్రత్యక్షమయ్యాయి.

E.ABRAHAM, ACHANTA
Published on: 25 Aug 2026 7:15 PM IST
Penumantra
X

Penumantra: పంచాయతీ వాహనాలపై విచారణ జరపాలని డిమాండ్!

పెనుమంట్ర: గ్రామంలో చెత్త సేకరణ కోసం పంచాయతీ ఆధ్వర్యంలో వినియోగిస్తున్న చెత్త రిక్షాలు పాత సామాన్ల కొనుగోలు దుకాణంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల నుంచి చెత్త సేకరించాల్సిన రిక్షాలు పాత సామాన్ల దుకాణంలో కనిపించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీకి చెందిన సామగ్రి ఇలా బయటకు ఎలా వెళ్లింది? ఎవరి అనుమతితో పాత సామాన్ల దుకాణానికి చేరింది? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన పంచాయతీ వాహనాలు, సామగ్రి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story