Rampachodavaram: గిరిజనుల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉంది సీతంశెట్టి

Rampachodavaram: గిరిజనుల సంక్షేమానికి టీడీపీయే ఏకైక పార్టీ అని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు స్పష్టీకరణ. జీవో 3 రద్దుకు వైసీపీ ప్రభుత్వమే కారణమని విమర్శ.

Prasanna, Rampachodavaram
Published on: 21 July 2026 3:08 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: గిరిజనుల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉంది సీతంశెట్టి

రంపచోడవరం: గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

జీవో నంబర్–3 అమలు నిలిచిపోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. 2020లో సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అప్పటి ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడంతో జీవో నంబర్–3ను కోల్పోయామని విమర్శించారు.

ప్రస్తుతం జీవో నంబర్–3పై మాట్లాడుతున్న వైసీపీ నాయకులు అధికారంలో ఉన్న నాలుగేళ్ల పాటు ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

గిరిజనుల హక్కులు, అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, జీవో నంబర్–3కు ప్రత్యామ్నాయంగా గిరిజనులకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని సీతంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story