Tanuku: తణుకు కోర్టులో మొక్కలు నాటిన న్యాయమూర్తులు!
Tanuku: తణుకు కోర్టు భవనాల సముదాయంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం. ప్లాస్టిక్ నిషేధించాలని కోరిన జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి.
Tanuku: తణుకు కోర్టులో మొక్కలు నాటిన న్యాయమూర్తులు!
Tanuku: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి ఆధ్వర్యములో తణుకు కోర్టు భవనముల సముదాయములో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి , ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని న్యాయమూర్తి శ్రీదేవి కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి K కృష్ణ సత్యలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి G స్వర్ణ, రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ K కృష్ణ వేణి, సీనియర్ న్యాయవాదులు D రాధమ్మ, VSRD దీక్షితులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు క్రాంతి ప్రసాద్, కౌర్ వెంకటేశ్వర్లు, బింకం రవి కుమార్, Sk బాజీ, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Next Story




