Bhimavaram: సంక్షేమ పథకాలే ధ్యేయం: భీమవరంలో ఇంటింటికీ టీడీపీ నేతలు!

Bhimavaram: 32వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 19 Aug 2026 6:49 PM IST
Bhimavaram
X

Bhimavaram: సంక్షేమ పథకాలే ధ్యేయం: భీమవరంలో ఇంటింటికీ టీడీపీ నేతలు!

​భీమవరం: భీమవరం నియోజకవర్గం పరిధిలోని 32వ వార్డులో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ ప్రచార కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని, ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజలతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు కూలంకషంగా వివరించారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో భూపతిరాజు బుజ్జిరాజు, బొక్కా శ్రీనివాసరావు, సత్యనారాయణ రాజు, కొరటాని అజయ్, బోడసింగి గౌరి, బొండాల మౌనిక, అనురావూరి కృష్ణప్పరావు, గోడపాటి బాబురావు, రాజా నాయుడులతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్డు ప్రజలు నాయకులకు ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story