Eluru: ఏలూరు జిల్లాలో పులి కలకలం.. గ్రామస్తులకి అటవీశాఖ హెచ్చరిక!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 22 Jun 2026 12:08 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో పులి కలకలం.. గ్రామస్తులకి అటవీశాఖ హెచ్చరిక!

ఏలూరు జిల్లా: పోలవరం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన తెల్లదెబ్బలు ఏరియాలో పులి సంచరిస్తుందని ఫారెస్ట్ రేంజర్, అధికారి షేక్ వలి తెలియజేసినారు.

కావున దగ్గర ఉన్నటువంటి గడ్డపల్లి, గిన్నిపల్లి, దరవాడ, చిలకలూరు, తంగేడుకొండ మొదలగు ఏరియాలో గల గ్రామస్తులు అందరూ రాత్రిపూట ఒంటరిగా సంచించరాదని, పశువుల కొట్టములయందు లైటింగ్ ఏర్పాటు చేసుకొని అప్రమత్తంగా ఉండి, జాగ్రత్త గా ఉండాలని అటవీ అధికారులు తెలియజేస్తున్నారు.

ఎప్పటికప్పుడు పులి యొక్క కదలికలను జియో ట్యాప్ ద్వారా పరిశీలిస్తున్నట్టు అటువిక్షేత్ర అధికారి తెలియపరిచారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM

Next Story