మహిళలు భద్రతపై జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన. 'శక్తి యాప్' వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన శక్తి టీమ్స్.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 11 Jun 2026 3:09 PM IST
West Godavari
X

మహిళలు భద్రతపై జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్., గారి దిశానిర్దేశం మేరకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతను అత్యంత ప్రాధాన్యత అంశంగా భావిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా, జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న "శక్తి టీమ్స్" ఆధ్వర్యంలో బుధవారం, జూన్ 10న వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమాలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని, మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా దిశానిర్దేశం చేశారు.

ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, అత్యవసర సమయాల్లో మహిళలకు రక్షణ కవచంగా నిలిచే "శక్తి యాప్" వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతో పాటు, దాని ప్రాముఖ్యతను వివరించారు. నేటి డిజిటల్ కాలంలో మహిళలు మరియు చిన్నారులు ఎదుర్కొంటున్న సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు మరియు గోప్యతా నియమాల గురించి పోలీసు అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా, 'పోక్సో' (POCSO) చట్టంపై కఠినమైన నిబంధనలను వివరిస్తూ, బాలికల రక్షణ కోసం సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

మహిళా సంబంధిత నేరాల పట్ల ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను ఆశ్రయించాలని, బాధితుల గోప్యతను కాపాడుతూ తక్షణమే స్పందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

మహిళల భద్రత మరియు వారి సాధికారతే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని, ప్రజలందరూ పోలీసులతో కలిసి భద్రతాయుతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story