Devarapalli: ఆగస్టు 5న దేవరపల్లికి జగన్.. రైతులతో ముఖాముఖి!

Devarapalli: ఆగస్టు 5న తూర్పు గోదావరి జిల్లా వైఎస్ జగన్ రానున్నారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, రైతులతో ముఖాముఖి కానున్ నట్లు తానేటి వనిత తెలిపారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 26 July 2026 6:19 PM IST
Devarapalli
X

Devarapalli: ఆగస్టు 5న దేవరపల్లికి జగన్.. రైతులతో ముఖాముఖి!

తూర్పు గోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 5న పర్యటించనున్నట్లు మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తానేటి వనిత తెలిపారు. ఈ మేరకు శనివారం పార్టీ నాయకులతో సమావేశమై పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.

పర్యటనలో భాగంగా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. అక్కడ జరుగుతున్న పొగాకు వేలం ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని, పంట సాగు నుంచి మార్కెటింగ్ వరకు ఉన్న ఇబ్బందులపై చర్చించనున్నారు.

ముఖ్యంగా పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, కొనుగోలు ప్రక్రియలో జాప్యం, పెరుగుతున్న సాగు వ్యయాలు, ఎగుమతుల పరిస్థితి, మార్కెటింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. రైతుల అభిప్రాయాలు, సూచనలను నమోదు చేసి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

జగన్ పర్యటన నేపథ్యంలో దేవరపల్లిలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. వేలం కేంద్రం పరిసరాల్లో అవసరమైన ఏర్పాట్లతో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు. గోపాలపురం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పొగాకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పర్యటనను చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పార్టీ నిరంతరం పనిచేస్తుందని, రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి కొనసాగిస్తామని తానేటి వనిత స్పష్టం చేశారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story